భారతదేశం, మార్చి 24 -- రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే మే నెలలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

మే నెలలో సెట్ నోటిఫికేషన్ ఇవ్వగా. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

మరోవైపు గతేడాదిలో నిర్వహించిన తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి.. ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.

Published by HT Digital Content...