భారతదేశం, ఆగస్టు 3 -- రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కాగా. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి(ఆగస్ట్ 3, 2026) నుంచి ప్రారంభం కానుంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉన్నత విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

అభ్యర్థులు ఎటువంటి అదనపు ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారికి ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు.

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించే సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి అధికారులు అవక...