భారతదేశం, ఏప్రిల్ 13 -- ఇంటర్‌మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు పరీక్షలు తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మే 13 నుంచి 21వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి.

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఖరారు కాగా. నేటి నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఆయా విద్యార్థులు. వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఏప్రిల్ 20వ తేదీలోపు ఈ ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గడువు పొడిగింపు ఉండని తెలిపింది.

టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం ప...