భారతదేశం, ఆగస్టు 17 -- TG ICET 2026 Final Phase Counselling : రాష్ట్రంలోని ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ (TG ICET) 2026 చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి (ఆగస్టు 17) నుంచి ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులకు, మంచి కళాశాలల్లో సీటు ఆశిస్తున్న అభ్యర్థులకు ప్రవేశాలు పొందేందుకు ఇదే చివరి అవకాశం.

షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మొదటి విడతలో పాల్గొనని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హెల్ప్ లైన్ సెంటర్లలో ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంద...