భారతదేశం, జూలై 21 -- Telangana High Court On HYDRAA Commissioner : న్యాయస్థానాలు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని ఒక ప్రైవేట్ ఆస్తిలోకి అధికారులను అనుమతించడం ద్వారా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తన న్యాయవ్యవస్థ అధికారాన్ని, చట్ట పాలనను దెబ్బతీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు దిక్కార పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. కోర్టు ఉత్తర్వులను ...