భారతదేశం, జూన్ 10 -- Telangana Fee Reimbursement New Rules : గత కొంతకాలం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల విషయంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్. కీలక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను రద్దు చేసి. కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

గతంలో మాదిరిగా కాలేజీల ఖాతాలోకి కాకుండా.. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకే నేరుగా నగదు బదిలీ (Direct Benefit Transfer - DBT) చేయనున్నారు. ఇందుకోసం గతంలో అమలులో ఉన్న జీవో నం.7ను రద్దు చేస్తూ.. కొత్త నిబంధనలతో బోధన ఫీజుల నోడల్‌ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ సరికొత్త ఉత్తర్వులు (జీవో నం.9) జారీ చేసింది. ఈ మార్పులు రాబోయే 2026-27 విద్యాసంవత్సరం నుంచి అధికారికంగా...