భారతదేశం, జూన్ 1 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అంతా ఒక ప్రత్యేకమైన 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారానే అమలు కానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రకటించారు. రాబోయే రెండు రోజుల్లోనే ఈ ట్రస్ట్‌ను అధికారికంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, ప్రక్రియను సరళీకృతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కీలక సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ.....