భారతదేశం, జూలై 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు నమోదు చేసుకున్న ఐచ్ఛికాల ఆధారంగా అధికారులు మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది. అభ్యర్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు రావడానికి ఈ మాక్ అలాట్‌మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.

మాక్ అలాట్‌మెంట్ ఫలితాలను చూసుకున్న తర్వాత, అభ్యర్థులు ఎవరైనా తమ ప్రాధాన్యాలను మార్చుకోవాలని భావిస్తే వారికి అధికారులు మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి జూలై 5 నుంచి జూలై 7 వరకు గడువు ఇచ్చారు.

ఒకవేళ అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చకపోతే, మాక్ అలాట్‌మెంట్ కోసం గతంలో పెట్టుకున్న ఆప్షన్లనే మొదటి విడత సీట...