భారతదేశం, జూలై 14 -- TG EAPCET Counselling Seat Allotment 2026 : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ -2026 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడతలో తాత్కాలికంగా సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, అలాగే ట్యూషన్ ఫీజు చెల్లించడానికి విధించిన గడువు నేటితో (జూలై 14) ముగియనుంది. జూలై 10వ తేదీన ఉన్నత విద్యామండలి మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

విద్యార్థులు తమకు కేటాయించిన సీటును ఖరారు చేసుకోవాలనుకుంటే. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించని వారి, లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లను ఆటోమేటిక్‌గా రద్దు చేస్తామని అధికారులు ...