భారతదేశం, ఏప్రిల్ 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే వెంటనే సవరించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ చేసుకోవాలని సూచించారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ కోసం సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతర...