భారతదేశం, జూన్ 26 -- TG DOST 3rd Phase Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (DOST) మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఉన్నత విద్యామండలి గురువారం ఈ విడత సీట్లను అధికారికంగా విడుదల చేసింది.

ఈ విడత కౌన్సిలింగ్‌లో మొత్తం 93,516 మంది విద్యార్థులు డిగ్రీ సీట్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ఎప్పటిలాగే కామర్స్ కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కామర్స్ విభాగంలో అత్యధికంగా 37,510 మంది సీట్లు సాధించగా, ఆ తర్వాత స్థానంలో ఫిజికల్ సైన్సెస్ నిలిచింది. ఫిజికల్ సైన్సెస్ కోర్సుల్లో 21,942 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

దోస్త్ మూడో విడతలో సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,284 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అయితే, అందుబాటు...