భారతదేశం, మే 31 -- TG DOST Phase 3 Registration 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ దోస్త్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియలు పూర్తి కాగా.నేటి నుంచి మూడో విడత ప్రక్రియ ప్రారంభమైంది.

గత రెండు విడతల్లో సీటు రాని విద్యార్థులు, సీటు వచ్చినా నచ్చని వారు మరియు ఇప్పటివరకు దోస్త్‌లో అసలు రిజిస్టర్ చేసుకోని అభ్యర్థులు ఈ మూడో విడత కౌన్సెలింగ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ వంటి కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.

కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోవాలి. ఇప్పటికే మొదటి లేదా రెండో విడతలో సీటు వచ్...