భారతదేశం, మే 30 -- TG DOST Second Phase Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ప్రవేశాలు పూర్తి కాగా.. ఇవాళ రెండో విడత సీట్లను కేటాయించారు.

దోస్త్ 2026- రెండో విడతలో 46,504 మంది విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకోగా.. మొదటి విడతలో సీటు వచ్చి అంతకంటే మంచి కాలేజీ కోసం చూస్తున్న విద్యార్థులతో కలిపి మొత్తం 60,439 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరిలో 52,302 మంది విద్యార్థులకు సీట్లు ఖరారయ్యాయి.

కేటాయించిన సీట్లలో కోర్సుల వారీగా కామర్స్ 21,431, ఫిజికల్ సైన్స్ - 15,245, లైఫ్ సైన్సెస్ - 9,664, ఆర్ట్స్ - 5,955, ఇతర కోర్సులకు చెందిన ఏడు మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు సందేశాలు కూ...