భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

డీఈఈసెట్‌ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఎస్‌ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారు వివరాల్లో తప్పులుంటే ఈనెల 17, 18 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు....