భారతదేశం, సెప్టెంబర్ 4 -- TG Cheyutha Pensions Applications : చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రకాల పింఛన్లకు సంబంధించి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) ప్రస్తుతం అందుబాటులో లేకపోయినప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే... అధికారులు క్షేత్రస్థాయిలో జరిపే పరిశీలన సమయానికి మాత్రం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇంతకుముందు పింఛన్లు అందుకొని, పలు సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల మధ్యలోనే పింఛన్ నిలిచిపోయిన అర్హులైన లబ్ధిదారులు కూడా ఇప్పుడు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెర్ప్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన...