భారతదేశం, మార్చి 30 -- గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం(మార్చి 29, 2026) నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఏకంగా 30 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. ఇది వేడి తీవ్రత గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. వీటిలో 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(టీజీడీపీఎస్) విడుదల చేసిన రోజువారీ వాతావరణ నివేదిక ప్రకారం, జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో అత్యధికంగా 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత దుమ్ముగూడెం (భద్రాద్రి కొత్తగూడెం), కాసీపేట (మంచిర్యాల), పెద్దావుర (నల్గొండ), భీంగల్ (నిజామాబాద్)లలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేల (ఆదిలాబాద్), ఆసిఫాబాద్ (కుమారం భీం ఆసిఫాబాద్), సుల్తానాబాద్ (పెద్దపల్లి)లలో...