భారతదేశం, ఆగస్టు 12 -- Telangana Smart Ration Card 2026 : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు పౌర సరఫరా వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు.

సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమానికి అనుగుణంగా. ఏకకాలంలో రాష్ట్రంలోని మిగిలిన 33 జిల్లాల కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒకేసారి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ర...