భారతదేశం, ఆగస్టు 7 -- Telangana Smart Ration Cards : అర్హులైన పేదలందరికీ ప్రతిష్టాత్మకంగా కొత్త ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సరికొత్తగా రూపొందించిన సుమారు 1.05 కోట్ల లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆర్డీవో పర్యవేక్షణలో.. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అత్యంత పారదర్శకంగా... ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా నేరుగా లబ్ధిదారులకు కార్డులు చేరేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందడానికి ఈకేవైసీ ప్రక్రియ అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఈ...