భారతదేశం, ఏప్రిల్ 23 -- రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోందని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటికే మెజారిటీ లబ్ధిదారులకు బియ్యం అందినట్లు అధికారులు ధృువీకరించారు. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ నెల 21వ తేదీ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 86 శాతం పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక మార్గదర్శకాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి మొత్తం 6,43,303 టన్నుల బియ్యం కేటాయించగా. అందులో ఇప్పటికే 5,48,140 టన్నులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు.

ఇంకా ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోని వారు ఉంటే.. ఈ...