భారతదేశం, ఏప్రిల్ 1 -- వాతావరణశాఖ మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. కోస్తాంధ్రతో పాటు దానిని అనుకుని ఉన్న తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. అంతేకాకుండా కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు మీదుగా వరకు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది.

ఈ ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు, ఇక వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి జి...