భారతదేశం, జూన్ 24 -- తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీతో పాటు హైదరాబాద్ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలనా సేవా (IAS) అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్...