భారతదేశం, ఏప్రిల్ 12 -- ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో తమ మార్కులను చూసుకోవచ్చు. మార్కుల విషయంలో అసంతృప్తి ఉన్నవారికి రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వంటి అవకాశాలను బోర్డు కల్పిస్తుంది.

మార్చి 15 నుంచి 20 కేంద్రాల్లో మూల్యాంకనం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నాటికి పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 8 వరకు క్రోడీకరణ పనులు ముగించి, రికార్డు వేగంతో ఫలితాలు సిద్ధం చేశారు. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే అత్యంత వేగవంతమైన ప్రక్రియ చెప్పుకోవచ్చు.

సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం అవ్వండి. ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. లేదంటే ఏడాది వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫెయిల్ అయినంత మాత్రన జీవితం ఆగిపోయినట్టు కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

పాస్ అయిన వెంటనే విద్యార్థులు రిలాక్స్ కాకూడదు. తర్వాతి చదువులు, కాలేజీ అడ్మిషన్లు ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్ ...