భారతదేశం, మార్చి 12 -- రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 8వ తేదీన ప్రారంభించింది.

ఈ బృహత్తర కార్యక్రమ పురోగతి, అమలు తీరుపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సమీక్షించారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అమలులో అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు. టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను హాస్పిటల్స్‌కు తీసుకురావడానికి.. పరీక్షల అనంతరం వారిని తిరిగి సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని సెర్ప్‌ అధికారులకు సూచించారు.

ఒకేరోజు ఎక్కువ మందిని హాస్పిటల్‌కు తరలించి.. వారికి ఇబ్బంది కలిగించొద్దన్నారు. ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్‌ మెయింటేయ...