భారతదేశం, ఏప్రిల్ 29 -- Jobs For Former Maoists in Telangana : హింసా మార్గాన్ని వీడి. సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్న ఆకాంక్షతో జనజీవన స్రవంతిలో కలిసిన గిరిజన యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న 20 మంది మాజీ మావోయిస్టులను 'గిరిదర్శకులు'గా (టూరిస్ట్ గైడ్లు) నియమించింది. మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు భూమి పూజ నిర్వహించిన సందర్భంగా. వీరికి యువకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.

లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ (టూరిస్ట్ గైడ్) లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శి...