భారతదేశం, మార్చి 20 -- రాష్ట్రంలోని ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా. కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్గ ప్రకటించారు. ఇక ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తామని.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి రాబోతుందని తెలిపారు. ఈ బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా.. మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందజేస్తారని వివరించారు.

మొత్తం రూ...