భారతదేశం, ఏప్రిల్ 2 -- తెలంగాణ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రయోగత్మకంగా అమలు చేస్తోంది రెవెన్యూ శాఖ. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రెవెన్యూ శాఖ విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించేందుకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ.. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది.

ఈ ఐదు మండలాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా.. మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. కేర‌‌‌‌ళ ప‌‌‌‌ర్యట‌‌‌‌న‌‌‌‌లో ఉన్న...