భారతదేశం, సెప్టెంబర్ 9 -- Telangana Assembly BRS MLAs Suspended : తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు తీవ్ర ఆందోళనల నడుమ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. సభా వ్యవహారాలకు నిరంతరం అడ్డంకి కలిగిస్తున్నారనే కారణంతో కేటీఆర్, హరీశ్‌రావులతో సహా ఇతర శాసనసభ్యులను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

బుధవారం ఉదయం మూడో రోజు సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి, కేసీఆర్ ఇంటి వద్ద ర్యాలీ, శాంతి భద్రతల అంశాలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.ఈ మూడు అంశాలపై సభ వెంటనే చర్చించాలని కోరింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్ల...