భారతదేశం, సెప్టెంబర్ 15 -- రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించే ఉద్జేశ్యంతో ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" కింద దరఖాస్తులను స్వీకరిస్తోంది. స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు వీలుగా అర్హులైన వారిని ఈ స్కీమ్ కింద ఎంపిక చేస్తారు.

అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన మహిళలు వెంటనే తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నేడే (సెప్టెంబర్ 15, 2026) చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా TGOBMMS పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు ...