భారతదేశం, మార్చి 25 -- ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడతాయనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. మంగళవారం హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపించాయి. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయి.
ఈ పరిస్థితులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
పెట్రోల్, డీజిల్షార్టేజీ అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో చాలా బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయని తెలిపింది. అనవసరమైన భయాందోళనల ఫలితంగా ఈ తరహా కృతిమ కొరతకు దారి తీసిందని పేర్కొంది.
ఇందన కొరత వదంతుల నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని పౌరసరఫరాల శాఖ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.