భారతదేశం, ఏప్రిల్ 16 -- TCS Nashik sexual harassment: మహారాష్ట్రలోని ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ బీపీఓ యూనిట్ వేధింపుల కేసుపై జాతీయ మహిళా కమిషన్ (NCW) రంగంలోకి దిగింది. అక్కడి కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయన్న వార్తలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ అరాచకాలపై క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ చేసేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో లోతైన విచారణ జరిపేందుకు బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సాధనా జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇందులో హర్యానా మాజీ డీజీపీ బి.కె. సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా, ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ లీలావతి సభ్యులుగా ఉన్నారు. "ఈ కమిటీ ఏప్రి...