భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ కార్యాలయం గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. అక్కడ మత మార్పిడి కార్యకలాపాలు సాగుతున్నాయని, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె. కృతివాసన్ తొలిసారిగా స్పందించారు. సంస్థ ప్రతిష్ఠను, ఉద్యోగుల భద్రతను కాపాడేందుకు అత్యున్నత స్థాయి విచారణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు.

ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చేందుకు టీసీఎస్ యాజమాన్యం ఒక శక్తివంతమైన విచారణా బృందాన్ని రంగంలోకి దించింది. కేవలం అంతర్గత విచారణతో సరిపెట్టకుండా, అంతర్జాతీయ సంస్థలైన 'డెలాయిట్' (Deloitte) మరియు ప్రముఖ లా ఫర్మ్ 'ట్రైలీగల్' (Trilegal) సేవలను ...