భారతదేశం, ఏప్రిల్ 19 -- Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. అయితే రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. అయితే తాజాగా ఏపీ, తెలంగాణ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్లు నడుస్తుండగా. తాజాగా చర్లపల్లి - సంత్రాగచ్చి. హైదరాబాద్ - సంత్రాగచ్చి, కాకినాడ టౌన్ - హిసార్ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 21 నుంచి పట్టాలెక్కనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్,...