భారతదేశం, మే 12 -- SCR Summer Special Trains : వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట - నిజాముద్దీన్ మరియు విజయవాడ - ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

కాజీపేట - నిజాముద్దీన్ : కాజీపేట నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైలు (నెం. 07662) మే 22, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 13.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం రాత్రి 23.40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్ - కాజీపేట రైలు (నెం. 07663) మే 25, 2026 (సోమవారం) తెల్లవారుజామున 03.40 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 11.00...