భారతదేశం, ఏప్రిల్ 24 -- వేసవి కాలం వచ్చిందంటే చాలు రైళ్లలో బెర్తుల కోసం యుద్ధం చేయాల్సిందే. ఈ రద్దీని ముందే ఊహించిన భారతీయ రైల్వే, ప్రయాణికులకు ఊరటనిచ్చేలా భారీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుండి జూలై 15 వరకు సుమారు మూడు నెలల పాటు రికార్డు స్థాయిలో 18,262 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సర్వీసుల సంఖ్యను గణనీయంగా పెంచడం విశేషం.

ప్రస్తుతం ప్లాన్ చేసిన 18,262 ట్రిప్పులలో ఇప్పటికే 11,878 సర్వీసులను రైల్వే శాఖ ఖరారు చేసింది. మిగిలిన సర్వీసులను కూడా దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసించే ముంబై, బెంగళూరు, సూరత్, అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాల నుండి సొంతూళ్లకు వచ్చే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో మేలు చేయనున్నాయి.

"వేసవి రద్దీ దృష్ట్యా ప్రయ...