భారతదేశం, ఆగస్టు 29 -- Machilipatnam Shivamogga Special Train : తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ప్రయాణించే రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం నుంచి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన శివమొగ్గ టౌన్ మధ్య ఒక ప్రత్యేక రైలు సర్వీసును నడపనున్నట్లు వెల్లడించింది. పండుగలు, వారాంతపు రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

మచిలీపట్నం - శివమొగ్గ టౌన్ ప్రత్యేక రైలు (రైలు నంబరు 07217) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30 (ఆదివారం) మధ్యాహ్నం 15:55 గంటలకు మచిలీపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.

శివమొగ్గ టౌన్ - మచిలీపట్నం ప్రత్యేక రైలు (రైలు నంబరు 07218) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 సెప్టెంబర్ 02 (బుధవారం) సాయంత్రం 17:40 గంటలకు ...