భారతదేశం, జూలై 9 -- ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండి.. ఇంకా టెట్(TET) అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Special TET) నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం దొరుకుతుంది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి. 2011 కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 లోపు కచ్చితంగా టెట్ అర్హత సాధించాలి. ఒకవేళ ఈ గడువులోగా అర్హత సాధించకపోతే వారి సర్వీసుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో...