భారతదేశం, జూలై 16 -- భూగోళంపై మరో అద్భుత ఖగోళ వింతకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో అత్యంత కీలకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఖగోళ ప్రేమికులను ఎంతగానో అలరించే ఈ గ్రహణం ఆగస్టు 12, 2026 న సంభవించనుంది. దీని తర్వాత మళ్లీ వచ్చే ఏడాది అంటే ఆగస్టు 2, 2027న ఏర్పడే సూర్యగ్రహణం కూడా ఎంతో విశిష్టమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఈ రెండు గ్రహణాల ప్రత్యేకతలు ఏమిటి, ఇవి భారతదేశంలో కనిపిస్తాయా లేదా.. అలాగే ద్వాదశ రాశిచక్రాలపై వీటి జ్యోతిష్య ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుగా నిలిచి తన నీడను సృష్టిస్తాడు. అమెరికా అంతరిక్ష ...