భారతదేశం, ఆగస్టు 16 -- Telang Smart Ration Card Status : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా.. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏకకాలంలో పంపిణీ ప్రక్రియను చేపట్టారు.

గతంలో రాష్ట్రంలో సుమారు 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండేవారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్ల చేర్...