భారతదేశం, ఆగస్టు 25 -- రాష్ట్రంలో పక్కాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంపై విద్యావంతులైన అధికారులు, ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో నిర్వహించే గ్రామ, వార్డు సభలు, ఎలక్టోరల్ రోల్ సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఓటర్ల జాబితాలో ఉండే తప్పులను సరిదిద్దడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంపై సీఈఓ క్షేత్రస్థాయి అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు గ్రామ, వార్డు సభలను వేదికగా చేసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు. ఈ సభల్లో బీఎల్ఓలు క్రింది అంశాలను విధిగా చదివి వినిపించాలని ఆదేశించారు.

2026 అక్టోబర్ 01 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకు...