భారతదేశం, ఆగస్టు 7 -- తెలంగాణలోని ఓటర్లు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కోసం తమ గణన పత్రాలను పూర్తి చేయడంలో చాలామంది లైట్ తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 5 వరకు ఏకంగా 75,20,544 మంది ఓటర్లు తమ ఫారాలను బీఎల్‌ఓలకు ఇంకా సమర్పించాల్సి ఉంది.

వీటిలో అన్ని జిల్లాలలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లో 20,02,774 మంది ఓటర్లు తమ ఫారాలను ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వరుసగా 13,14,710, 11,09,751 ఫారాలు ఇంకా డిజిటలైజ్ కావాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యల్పంగా 26,202, 27,624, 36,010 మంది ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల విషయానికొస్తే, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ...