భారతదేశం, జూన్ 4 -- Singareni Polytechnic Admissions 2026 : సింగరేణి సంస్థ పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా నస్పూర్‌ (CCC) లో ఏర్పాటు చేసిన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ (SCP) కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ కళాశాలలో మొత్తం 300 సీట్లు అందుబాటులో ఉండగా. వీటిని ఎస్సీసీఎల్ మేనేజ్‌మెంట్ కోటా కింద 150 సీట్లు, ప్రభుత్వ కోటా కింద 150 సీట్లుగా విభజించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 150 సీట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మేనేజ్‌మెంట్ కోటాలోని ఈ 150 సీట్లకు కేవలం సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు....