భారతదేశం, మే 21 -- Singareni Battery Energy Storage System : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) అద్భుత ఫలితాలను ఇస్తోంది. పగటిపూట సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో... స్థానిక అవసరాలకు పోను మిగిలిపోయే కరెంటును వృథాగా గ్రిడ్‌కు వదలకుండా ఈ బ్యాటరీ వ్యవస్థలో నిల్వ చేస్తున్నారు. ఇలా దాచిన విద్యుత్‌ను డిమాండ్ ఉన్న సమయంలో తిరిగి వినియోగించుకుంటూ సింగరేణి సంస్థ భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకాలకు అనుగుణంగా నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట...