భారతదేశం, జూన్ 15 -- Secunderabad Railway Station Redevelopment :దేశంలోనే ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్తగా మారబోతుంది. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు మరియు విమానాశ్రయాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 64 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలను, ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

సికింద్రాబాద్ స్టేషన్ సరికొత్త రూపాంతరంలో ప్రయాణికులకు గరిష్ఠ సౌకర్యం మరియు అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిరంతరాయంగా రైళ్ల రాకపోకలు సాగుతున్నప్పటికీ.. ప్రయాణికులకు ఇబ్బంద...