భారతదేశం, జూన్ 6 -- SCR Weekly Special Trains : వేసవి సెలవులు ఉండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రయాగ్‌రాజ్ - ఎస్.ఎస్.ఎస్. హుబ్బళ్లి స్టేషన్ల మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ వారంతపు ప్రత్యేక రైళ్లు కాచిగూడ మీదుగా నడుపుతున్నట్లు పేర్కొంది.

రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ముఖ్య నగరాల మీదుగా సాగుతాయి. ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, భింద్, సోని, గ్వాలియర్, శివ్‌పురి, గుణా, బినా, భోపాల్, నాగ్‌పూర్, బల్లార్షా స్టేషన్లలో ఇవి ఆగుతాయి.

అలాగే మన తెలుగు రాష్ట్రాల పరిధిలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద...