భారతదేశం, మే 24 -- SCR Summer Special Trains 2026 :వేసవి సెలవులు ఉండటంతో రైల్వేస్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది.ఈ అదనపు రద్దీని నియంత్రించడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

తాజాగా తమిళనాడులోని తాంబరం (చెన్నై సమీపం), పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి (కోల్‌కతా సమీపం) మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఇందులో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం విభిన్న క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏసీ త్రీ టైర్ (AC 3-Tier), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లతో పాటు సాధారణ ప్రయాణికుల ...