భారతదేశం, జూలై 30 -- South Central Railway Special Trains 2026 : తెలుగు రాష్ట్రాల మీదుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రాబోయే ఆగస్టు నెలలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు కాన్పూర్ సెంట్రల్ నుంచి తమిళనాడులోని మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కీలకమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి ప్రధాన నగరాలు, పట్టణాల మీదుగా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాది, దక్షినాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే భక్తులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది.

కాన్పూర్ సెంట్రల్ - మధురై స్పెషల్ (ట్రైన్ నంబర్ 01925) :

మధురై - కాన్పూర్ సెంట...