భారతదేశం, సెప్టెంబర్ 4 -- సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు జనసాధారణ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 4న అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రెండు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఈ రైళ్లలోని అన్ని భోగీలు అన్‌రిజర్వ్‌డ్ (సాధారణ) కోచ్‌లేనని, ప్రయాణికులు జనరల్ టికెట్లతో నేరుగా ప్రయాణించవచ్చని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపారు.

Published ...