భారతదేశం, జూలై 26 -- SCR Special Trains Extension : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి దక్షిణ భారతంలో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో పలు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా. హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

వేసవి ప్రయాణాలు, పండుగల సీజన్ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. సీట్లు త్వరితగతిన నిండిపోతుండటం, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుండటంతో ఈ సేవా కాలాన్ని మరికొన్ని వారాల పాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా సాగే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ...