భారతదేశం, జూలై 18 -- South Central Railway Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - దానాపూర్ స్టేషన్ల మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా కలిపి మొత్తం 18 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛేవ్కీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అరా స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇందులో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ప్...