భారతదేశం, జూలై 29 -- SCR Tirupati Nagarsol Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సెకండ్ టైర్ , ఏసీ థర్డ్ టైర్ , స్లీపర్ క్లాస్,...